పొగతాగుతున్నారు.. పై లోకాలకు వెళ్లిపోతున్నారు..!

CHANNEL HYDERABAD

ప్రతి ఏడాది పొగతాగి పైలోకాలకు వెళ్లిపోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. 'పొగ మానండి బాబూ' అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా... పొగరాయుళ్లు మాత్రం పొగతాగడానికి స్వస్తి చెప్పట్లేదు. ఇలా పొగతాగి ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 60 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) అంచనాలో తేలింది.

పొగతాగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా 60 లక్షల మంది మరణిస్తున్నారని, ఈ మరణాలు అల్ప, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి పొగాకు వినియోగ మృతుల సంఖ్య ఏడాదికి 80 లక్షలకు పెరిగే ప్రమాదముందని ఈ సంస్థ హెచ్చరించింది.

ఈ నివేదిక గురించి డబ్ల్యుహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ చాన్‌ మాట్లాడుతూ, పొగాకు సంబంధిత అనారోగ్యం, మరణాలనుంచి తమ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని అన్నారు.

20వ శతాబ్దంలో పొగాకు వినియోగం వల్ల మొత్తం 10 కోట్లమంది మృత్యువాత పడ్డారు. పొగాకు వినియోగానికి సంబంధించి ప్రపంచ దేశాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని, దీని వినియోగాన్ని అడ్డుకోకుంటే ఈ దశాబ్దంలో పొగతాగి మరణించే వారిసంఖ్య వంద కోట్లకు చేరుకునే ప్రమాదముందని చాన్ హెచ్చరిస్తున్నారు.

Hyderabad Business Directories